
ధాన్యం కొనేవారే లేరు
నాకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పలు రకాల పంటలు సాగు చేశా. కష్టపడి పండించిన వరి, జొన్న కొనేవారు కరువయ్యారు. ఇప్పటికీ ధాన్యం 200 బస్తాల నిల్వ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్లో పండించిన ధాన్యం రూ.2వేల నుంచి రూ.2,400 వరకు పలికింది. ప్రస్తుతం ధాన్యం దళారులు రూ.1,400 అడుగుతున్నారు. చివరి గింజ వరకు కొంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.
–చంద్రశేఖర్రెడ్డి, అమ్మిరెడ్డినగర్, దొర్నిపాడు మండలం