ఎన్నో ఆశలతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం లేదు. గత ప్రభుత్వం కొలువులు ఇవ్వగా వాటిలో పనిచేస్తున్న వారిని దారుణంగా తొలగిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. దీనిపై యువత ఆగ్రహం వ్యక | - | Sakshi
Sakshi News home page

ఎన్నో ఆశలతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం లేదు. గత ప్రభుత్వం కొలువులు ఇవ్వగా వాటిలో పనిచేస్తున్న వారిని దారుణంగా తొలగిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. దీనిపై యువత ఆగ్రహం వ్యక

Jun 3 2025 5:41 AM | Updated on Jun 3 2025 5:41 AM

ఎన్నో

ఎన్నో ఆశలతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతకు ప్రభుత్వ ఉద

ఉన్న ఉద్యోగం పీకేశారు

సంజామల మండలం ఆకుమల్లకు చెందిన సుధాకర్‌రెడ్డి అనే యువకుడు 2017వ సంవత్సరంలో ఎంబీఏ పూర్తి చేశాడు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణంలో గత ఏడాది అక్టోబర్‌ వరకు సూపర్‌వైజర్‌గా పనిచేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి ఆస్థానంలో ప్రైవేట్‌ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి ఆసరా చూపించకుండా ఉన్న ఉద్యోగం తొలగించడంతో ఆ కుటుంబం జీవనోపాధి కోల్పోయింది. ఉన్నత చదువు చదివినా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, నిరుద్యోగ భృతి చెల్లించకపోవడంతో ఉపాధిలేక ఆ కుటుంబం అవస్థలు పడుతోంది.

నిరుద్యోగ భృతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

జాబ్‌ క్యాలెండర్‌ ఊసేలేదు

2014లో ఇదే తరహా వంచన

‘ఉపాధి’ పనులకు వెళ్తున్న యువకులు

జిల్లాలో 5.95 లక్షల మంది

నిరుద్యోగులు

కోవెలకుంట్ల: సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు 147 హామీల ఆశ చూపి గద్దెనెక్కిన కూటమి సర్కార్‌ పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అటకెక్కించింది. హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతను నిలువునా దగా చేసింది. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ. 3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించి యువతను పక్కాగా మోసం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ప్రమాణ స్వీకారం రోజున మెగా డీఎస్సీ నిర్వహణపై తొలిసంతకం చేసినా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ సా..గుతూనే ఉంది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నో హామీలు గుప్పించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు/ నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాది రూ. 15 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలు పెట్టుబడి సాయం, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ. 1500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్ల సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీల అమలుకు ఏడాది కాలం గడిచిపోయింది. జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగ భృతిపై గంపెడు ఆశలు పెట్టుకున్న యువతకు కూటమి సర్కార్‌ చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో కేవలం 4.46 లక్షల మంది మాత్రమే నిరుద్యోగులు ఉన్నట్లు కాకి లెక్కలు చూపిస్తోంది. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో 5,95,045 మంది నిరుద్యోగులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

2014లో ఇదే తరహా మోసం

2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 600కు పైగా అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దగా చేశారు. నిరుద్యోగంపై ఒక అడుగు ముందుకేసి జాబు రావాలంటే బాబు రావాలి... ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ. రెండు వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కపట ప్రేమ ప్రదర్శించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు యువనేస్తం పేరుతో ముందుకొచ్చారు. నెలకు రూ. 2వేల చొప్పున నాలుగున్న ఏళ్లకు సంబంధించి భృతి అందుతుందని డిగ్రీ, ఆపై చదువులు చదివిన నిరుద్యోగులు ఆశపడ్డారు. సర్కార్‌ నిరుద్యోగ భృతి వర్తింపుకు పలు ఆంక్షలు విధించి భృతిని రూ. వెయ్యికి కుదించింది. ఉమ్మడి జిల్లాలో 75వేలకు పైగా నిరుద్యోగులు ఉండగా ప్రభుత్వం విధించిన నిబంధనలతో పథకానికి 12 వేల మంది మాత్రమే అర్హత సాధించారని అరకొరగా నిరుద్యోగ భృతి చెల్లించి చేతులు దులుపుకుంది. 2019 ఎన్నికల్లో యువతీ, యువకులు తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పి ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పట్టం కట్టారు. 2024 ఎన్నికల వేళ నిరుద్యోగులకు నెలకు రూ. 3వేలు భృతి చెల్లిస్తామని నమ్మ బలికి యువతీ, యువకుల ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడం విచారకరం.

నిరుద్యోగులకు అవస్థలు

జాబ్‌ క్యాలెండర్‌ లేక, నిరుద్యోగ భృతి అందక ఉన్నత చదువులు చదివిన యువతీ యువకులకు సరైన ఉపాధి అవకాశాలు లేక అవస్థలు పడుతున్నారు. బీటెక్‌, ఎంటెక్‌, పీజీ, తదితర పెద్ద పెద్ద చదువులు చదివిన యువకులు సైతం ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రైవేట్‌ రంగాలవైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె, తదితర నగరాల్లో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. కుటుంబ పరిస్థితులు బాగా లేక వందలాది మంది నిరుద్యోగులు స్థానికంగానే చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో పలు రకాల ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ అవకాశాలకు వయస్సు దాటి పోతుండటంతో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం వేచి ఉన్నారు.

ఎన్నో ఆశలతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతకు ప్రభుత్వ ఉద1
1/2

ఎన్నో ఆశలతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతకు ప్రభుత్వ ఉద

ఎన్నో ఆశలతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతకు ప్రభుత్వ ఉద2
2/2

ఎన్నో ఆశలతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతకు ప్రభుత్వ ఉద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement