
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
బొమ్మలస్రతం: అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ నెల 4న నిర్వహించే వెన్నుపోటు దినంలో నిలదీద్దామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్బాషా అన్నారు. నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి కార్యాలయంలో వెన్నుపోటు దినం వాల్పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్సిక్స్ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఏడాది పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాలను నిర్వీర్యం చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా బుధవారం ఉదయం 10 గంటలకు నంద్యాలలోని ఉదయానంద రెసిడెన్సీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యలను వివరిస్తామన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వెన్నుపోటు దినం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్సి, ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్ధర్సైమన్, జిల్లా జనరల్ సెక్రెటరీ సోమశేఖర్రెడ్డి, స్పోక్ పర్సన్ అనిల్ అమృతరాజ్, హరిప్రసాద్, శివనాగిరెడ్డి, రమణ, తిరుపతి, సుబ్బారెడ్డి, ప్రతాప్రెడ్డి, శశికళరెడ్డి తదితరుల పాల్గొన్నారు.
ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, ఇసాక్బాషా