మాజీ మంత్రి ఈటలతో ‘మేఘా’ మంతనాలు | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి ఈటలతో ‘మేఘా’ మంతనాలు

Mar 28 2023 1:00 AM | Updated on Mar 28 2023 1:00 AM

మాజీ మంత్రి ఈటలతో సెల్ఫీ దిగుతున్న 
ఎంపీపీలు కిచ్చారెడ్డి, మేఘారెడ్డి  - Sakshi

మాజీ మంత్రి ఈటలతో సెల్ఫీ దిగుతున్న ఎంపీపీలు కిచ్చారెడ్డి, మేఘారెడ్డి

వనపర్తి: జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం జిల్లాకేంద్రానికి వచ్చిన బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, చేరికల విభాగం రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పీ చైర్మన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సర్పంచులు రహస్యంగా చర్చలు జరిపారు. గులాబీపార్టీకి రాజీనామా చేసి 20 రోజులైనా.. నేటికీ ఏ పార్టీలో చేరుతారో స్పష్టం చేయలేదు. ఈ సమయంలో ఈటలతో జరిపిన రహస్య చర్చలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారన్న సంకేతాలు బయటకు పంపినట్లు తెలుస్తోంది. మరింతమంది ప్రజాప్రతినిధులు, తాజాలు, మాజీలను కలుపుకొని మరోపార్టీ తీర్థం పుచ్చుకోవాలనే వ్యూహరచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement