శంకర్‌‌-చరణ్‌ల మూవీపై మెగా అప్‌డేట్‌

Ram Charan Tweet On A Movie With Director Shankar Under Dil Raju Banner - Sakshi

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మెగా అప్‌డేట్‌ రానే వచ్చింది. హీరో రామ్‌చరణ్‌, దక్షిణాది దిగ్గజ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని హీరో రాంచరణ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. శుక్రవారం చెర్రి ట్వీట్‌ చేస్తూ.. ‘శంకర్‌ సార్‌ వంటి సినీ మేధావి దర్శకత్వంలో నా చిత్రం కూడా ఉండబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా ఎస్‌వీసీ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాతలైన దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో చెర్రి 15వ చిత్రం కాగా.. ఎస్‌వీసీ బ్యానర్‌లో ఇది 50వ చిత్రం కావడం విశేషం. 

తన కెరీర్‌లో ఇది 15వ చిత్రమని, దిల్‌రాజు బ్యానర్‌లో ఇది‌ 50వ చిత్రంగా రామ్‌చరణ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతేగాక ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందా అని కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అంతేగాక దీనిపై ఎస్‌వీసీ బ్యానర్‌ సంస్థ కూడా స్పందించింది. దిగ్గజ దర్శకుడు శంకర్‌- హీరో రాంచరణ్‌ల కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రం తమ సంస్థకు ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చని తెలిపింది. రెండు దిగ్గజాల కలయిలో వస్తున్న మొదటి చిత్రం తమ బ్యానర్‌లో 50వ చిత్రంగా రానుండం చాలా సంతోషం‍గా ఉందని, ఇది తమకు లభించిన అరుదైన గౌరవంగా పేర్కొంది. ఇక ఈ మూవీలోని మిగతా తారాగణాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా ఎస్‌వీసీ సంస్థ చెప్పుకొచ్చింది.

(చదవండి: శంకర్‌ దర్శకత్వంలో చరణ్?)
(రామ్‌చరణ్‌, యశ్‌తో శంకర్‌ మల్టీస్టారర్‌!
(ఆర్‌ఆర్‌ఆర్‌: యుద్ధానికి మధ్యలో నవ్వులు!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top