వన మహోత్సవానికి సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

వన మహోత్సవానికి సన్నద్ధం

Jun 30 2025 7:40 AM | Updated on Jun 30 2025 7:40 AM

వన మహోత్సవానికి సన్నద్ధం

వన మహోత్సవానికి సన్నద్ధం

న మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా శాఖల వారీగా ఎక్కడెక్కడ, ఏ రకాల మొక్కలు నాటాలనే విషయమై ఇప్పటికే అధికారులు అంచనాకు వచ్చారు.

– మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 492 గ్రామాలుండగా, 471 నర్సరీలు కొనసాగుతున్నాయి. వీటిలో 52.57 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది 37.10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో సింహభాగం డీఆర్‌డీఓ శాఖ పరిధిలో 25.66 లక్షలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 7.20 లక్షల మొక్కలు నాటనున్నారు. మెదక్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీల్లో 90 వేల చొప్పున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

అటవీ జాతి మొక్కలే అధికం

ఈ సంవత్సరం నాటే మొక్కల్లో అటవీ జాతికి చెందిన మొక్కలనే అధికంగా నాటనున్నారు. ఇందులో ప్రధానంగా గుల్‌మహర్‌, రేణి, సీతాఫల్‌, నలిమినార, రావి, మర్రి, మద్ది, వేట, టేకు, తదితర అటవీ జాతికి చెందిన మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగితావి ఇళ్లలో పెంచుకునేందుకు కొన్నిరకాల పూల మొక్కలను సైతం సిద్ధంగాఉంచారు.

శాఖల వారీగా లక్ష్యం

డీఆర్‌డీఓ 25,66,000

అటవీ 7,20,000

వ్యవసాయ 30,000

ఉద్యాన 25,000

పరిశ్రమలు 15,000

ఇరిగేషన్‌ 10,000

మైనింగ్‌ 15,000

ఎకై ్సజ్‌ 40,000

డీడబ్ల్యూఓ 6,000

ఇతరశాఖలు 23,000

మెదక్‌ మున్సిపాలిటీ 90,000

నర్సాపూర్‌ 90,000

రామాయంపేట 30,000

తూప్రాన్‌ 50,000

జిల్లాలో 24 శాతం మేర అడవులు

జిల్లాలో అన్నిరకాల భూములు 6 లక్షల వరకు ఉండగా, భూ భాగానికి 33 శాతం అడవులు ఉండాలి, కానీ జిల్లాలో కేవలం 24 శాతం మేరకు మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ లెక్కన ఇంకా 9 శాతం మేర అడవులు తక్కువగా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం అయి నెల రోజులు కావొస్తున్నా జిల్లాలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. కాగా వానలు సమృద్ధిగా కురిసిన వెంటనే మొక్కలు నాటడం ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 37.10 లక్షల మొక్కలు లక్ష్యం

శాఖల వారీగా కేటాయింపు

సమృద్ధిగా వర్షాలు కురవగానేప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement