‘ఉపాధి’ఎత్తివేతపై కుట్రలు మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ఎత్తివేతపై కుట్రలు మానుకోవాలి

Jun 9 2025 7:45 AM | Updated on Jun 9 2025 7:45 AM

‘ఉపాధి’ఎత్తివేతపై కుట్రలు మానుకోవాలి

‘ఉపాధి’ఎత్తివేతపై కుట్రలు మానుకోవాలి

తొర్రూరు: ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలను విరమించాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. ఆదివారం డివిజన్‌ కేంద్రంలోని లయన్స్‌క్లబ్‌లో వ్యవసాయ కార్మిక సంఘం మూడో జిల్లా మహాసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీలకు ఏడాదికి 200 రోజులు పని, రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు. ఈ పథకంలో అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ.. 50 ఏళ్లు దాటిన కూలీలకు నెలకు రూ.6 వేల పింఛన్‌, మృతి చెందిన కూలీకి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకానికి రూ.4 లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయి ంచాలని కోరారు. సీపీఐ, బీకేఎంయూ నాయకులు అజయ్‌, విశ్వేశ్వర్‌రావు, కుమార్‌,వెంకన్న ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement