
త్వరలో మహిళా క్రికెట్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ప్రతిభ గల మహిళా క్రీడాకారులను గుర్తించేందుకు త్వరలో మహిళా క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బస్వరాజు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఉచిత క్రికెట్ వేసవి శిక్షణ శిబిరాలు శనివారం ముగిశాయి. ముగింపు వేడుకలు కరుణాపురంలోని వంగాలపల్లి క్రికెట్ మైదానంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా బస్వరాజు హాజరై క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. వరంగల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు సదాశివ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బస్వరాజు పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణలో ని గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధే ధ్యేయంగా హెచ్సీఏ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు నిరంతరంగా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డబ్ల్యూడీసీఏ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో నిరంతర క్రికెట్ క్యాంపుల ఆవశ్వకతను గుర్తుచేస్తూ వంగాలపల్లి గ్రౌండ్ను హెచ్సీఏ పరిధిలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. రాబో యే జనరల్ బాడీ మీటింగ్లో జిల్లాలో ఫ్లడ్లైట్ల వెలుతురులో క్రికెట్ అకాడమికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ క్లబ్ కార్యదర్శులు భార్గవ్, శంకర్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్, అభివవినయ్, అజయ్సారథి పాల్గొన్నారు.
హెచ్సీఏ సంయుక్త కార్యదర్శి బస్వరాజు
ముగిసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు