
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ –2025 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీల్లో కలిపి ఎం. రవిచంద్రారెడ్డి 8వ ర్యాంకు, వి. నాగసిద్దార్థ 13వ ర్యాంకు, పి. సాక్షి 40వ ర్యాంకు, ఎ. అనుశ్రీ 47వ ర్యాంకు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టారని వారు తెలిపారు. బి. సాయి 68వ ర్యాంకు, బి. భరణి శంకర్ 90వ ర్యాంకు, జి. రాజేశ్ 106వ ర్యాంకు, బి. వినోద్ 115వ ర్యాంకు, ఎం. వెంకటకౌసిక్ 123వ ర్యాంకు, ఎస్. పవన్ 204వ ర్యాంకు, ఎ. సంతోశ్ 265వ ర్యాంకు, బి. వాగ్దేవి 269వ ర్యాంకు సాధించారని వారు పేర్కొన్నారు. ఇంకా పలువురు ఎన్నో ర్యాంకులు సాధించారని వారు వివరించారు. భవిష్యత్లో మరింత అత్యత్తమ ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. 50 సంవత్సరాలుగా పటిష్ట ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ ఎంసెట్ , ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతీ ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తమ తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని వారు తెలిపారు.

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం