
వైద్యసేవలు సమర్థవంతంగా అందించాలి
ఖిలా వరంగల్: పేదలకు వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించాలని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ప్రధానమంత్రి స్వస్త్య యోజన సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషన్ (హెచ్వ్యాక్) సిస్టమ్నకు మరమ్మతులు చేసి వెంటనే రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖిలా వరంగల్ ఖుష్మహాల్ ప్రాంగణంలో జరిగిన వేడుకల అనంతరం ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఎంజీఎం, కాకతీయ మెడికల్ కళాశాలలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు తదితర అంశాలపై సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా మెరుగైన సేవలందించాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
వెద్యసేవలు, ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణపై సమీక్ష