సమాజం అండదండలతోనే ‘పద్మశ్రీ’ | - | Sakshi
Sakshi News home page

సమాజం అండదండలతోనే ‘పద్మశ్రీ’

Jun 1 2025 12:52 AM | Updated on Jun 1 2025 12:52 AM

సమాజం

సమాజం అండదండలతోనే ‘పద్మశ్రీ’

హన్మకొండ అర్బన్‌ : సమాజం అండదండలతోనే తనకు ‘పద్మశ్రీ’ అవార్డు లభించిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న అనంతరం శనివారం వరంగల్‌ చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లో ఎమ్మార్పీస్‌ శ్రేణులు, ఇతర సంఘాల నాయకులు మంద కృష్ణ దంపతులను భారీ గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో, రాత్రి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో పద్మశ్రీ మంద కృష్ణమాదిగ మాట్లాడారు. ఈ సంవత్సరంలో ఎమ్మార్పీఎస్‌ పోరాట ఫలితంగా వర్గీకరణ సాధించడం, తనకు పద్మశ్రీ పురస్కా రం రావడం మాదిగజాతికి గర్వకారణమన్నారు. ఈ గౌరవం తనకు మాత్రమే కాకుండా తనకు ఉద్యమంలో అన్ని విధాలా సహకరించిన సమాజానికి కూడా అన్నారు. మూడు దశాబ్దాల ఉద్యమ పోరాటంలో అనేక ఒడిదొడుకులు ఎదురైనా ధైర్యంగా బరిలో నిలిచి లక్ష్యం సాధించామన్నారు.

ప్రధాని, ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు ..

వర్గీకరణ విషయంలో ముందుండి నడిపిన ప్రధాని మోదీ, సహకరించిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలి పారు. ఇది మాదిగ జాతి ఉద్యమ విజయానికి నిదర్శమన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకునిపోతూ వర్గీకరణ సాధించామన్నారు. ఈక్రమంలో అనేక వర్గాలు సహకరించాయన్నారు. రా నున్న రోజుల్లో వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.

కాళోజీ కళాక్షేత్రంలో జాతీయ

కార్యవర్గ సమావేశం..

వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సుమారు 11గంటల ప్రాంతంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రానికి చేరుకున్నారు. తెలంగాణ, ఏపీ ఎమ్మార్పీస్‌ నేతలు, ఇతర ప్రజాసంఘాల ఆఽధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణను సన్మానించారు. అనంతరం ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యవర్గ సమావేశంలో మందకృష్ణను అభినందిస్తూ తీర్మానంచేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యుక్షులు గోవిందు నరేశ్‌ మాదిగ, రుద్రపోగు సురేశ్‌ మాదిగ, జాతీయ నేత మంద కుమార్‌ మాదిగ, బొడ్డు దయాకర్‌, నరేంద్ర, బొర్ర భిక్షపతి, బుర్రి సతీశ్‌, రవి, గద్దల సుకుమార్‌, బండారు సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మంద కృష్ణమాదిగకు ఘన స్వాగతం

ఖిలా వరంగల్‌ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు వరంగల్‌లో ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆయన శనివారం రాత్రి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వరంగల్‌ వచ్చారు. రైల్వేస్టేషన్‌లో దిగిన ఆయనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం డప్పుచప్పుళ్లు, డీజే మోతలతో రైల్వేస్టేషన్‌నుంచి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం వరకు ర్యాలీగా చేరుకున్నారు.

వర్గీకరణ స్వప్నం సాకారమమడం ఉద్యమ విజయం

ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

సమాజం అండదండలతోనే ‘పద్మశ్రీ’ 1
1/1

సమాజం అండదండలతోనే ‘పద్మశ్రీ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement