
‘పుష్కరాల’ చెత్త తొలగింపు ఏదీ!
కాళేశ్వరం: గత నెల 15 నుంచి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగిన సరస్వతీనది పుష్కరాల్లో చెత్త తొలగింపుపై పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. గోదావరిలోని ఖాళీ వాటర్ బాటిళ్లు, వ్యర్థాలు తొలగించడం లేదు. దీంతో పశువులు అందులోని వ్యర్థాలు, ప్లాస్టిక్ను తింటున్నా యి. ఫలితంగా పశువులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇదే కాకుండా అన్నదానసత్రాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు నిర్వహించిన ప్రాంతాల్లో వ్యర్థాలు కుళ్లి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెంది, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికై నా అధి కారులు స్పందించి దోమలు వ్యాప్తి చెందకుండా చెత్తను తొలగించి, అన్ని వార్డుల్లో రెండు రోజులకు ఒక్కసారి వారం పాటు బ్లీచింగ్ ఫౌడర్ చల్లాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పారిశుద్ధ్యంపై తక్షణ చర్యలు తీసుకుని దుర్గంధం వెదజల్ల కుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.