
కార్పొరేట్ కంపెనీలతో రైతు పరిస్థితి దుర్భరం
ఖిలా వరంగల్: రైతులు గౌరవం కోల్పోయారని, పంట సాగు మొత్తం కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లడంతో రైతులు దుర్భర జీవితం ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ శివనగర్లోని సాయి ఫంక్షన్ హాల్ ఎంసీపీఐ నాయకుడు మోర్తాల చందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు గతంలో ఇంట్లో విత్తనాలు తయారు చేసుకునేదని, ఇప్పుడు పత్తి విత్తనాలు కావాలంటే నగదు పట్టుకుని విత్తన షాపులకు వెళ్లాలని, అక్కడ నాణ్యమైన విత్తనాలు లభించడం లేదన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేట్ చేతుల్లో ఉన్న విత్తన కంపెనీల ప్రభావాన్ని తగ్గించి రైతులకు నేరుగా సహాయ సహకారాలతోపాటు నాణ్యమైన విత్తనాలు అందించాలని కోరారు.
రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలి
రామన్నపేట : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడు మర్రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎంసీపీఐ రాష్ట్ర ప్రథమ మహాసభల్లో భాగంగా రెండో రోజు మంగళవారం నగరంలోని పోచమ్మమైదాన్లో నిర్వహించిన రైతు ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్రావు, నాయకులు చంద్రశేఖర్, సింగతి సాంబయ్య, పానుగంటి నర్సయ్య, బాషిపాక రమేశ్, కుస సంపత్, బల్సుకూరి నర్సయ్య, వీరమల్లు రాజు, మాదం తిరుపతి, తాటికొండ రవి, మాలోత్ రాజేశ్ నాయక్, రాకేశ్, సూరి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం