
ఆగస్టు 19 నుంచి కేయూలో ‘సైన్స్ కాంగ్రెస్ ’
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఆగస్టు 19 నుంచి 21వతేదీ వరకు మూడురోజులు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంఽధించిన బ్రోచర్ను కేయూలోని సెనేట్హాల్లో మంగళవారం వీసీ కె. ప్రతాప్రెడ్డి, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ చైర్మన్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సిహెచ్. మోహన్రావు, అకాడమీ బాధ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అకాడమీ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 19, 20, 21తేదీల్లో మూడురోజుల సమావేశాల్లో రెండు ప్లీనరీ సమావేశాలతోపాటుగారెండు సబ్థీమ్స్, నాలుగు స్పెషల్థీమ్స్తో సమాంతరంగా సెషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులకు సైంటిస్టులతో ఇంటరాక్షన్ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ సైన్స్ కాంగ్రెస్ జరగబోతుండడం ఇది రెండోది. 2018లో వరంగల్ నిట్లో నిర్వహించారు.ఈసారి కేయూలో జరగబోయే సైన్స్కాంగ్రెస్కు వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, జాయింట్ సెక్రటరీ వడ్డె రవీందర్, ప్రొఫెసర్ ఎస్ఎం రెడ్డి, ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.