మినీ ట్యాంక్‌బండ్‌ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మినీ ట్యాంక్‌బండ్‌ పనుల పరిశీలన

May 27 2025 1:04 AM | Updated on May 27 2025 1:04 AM

మినీ ట్యాంక్‌బండ్‌  పనుల పరిశీలన

మినీ ట్యాంక్‌బండ్‌ పనుల పరిశీలన

బయ్యారం: మండలంలోని గంధంపల్లి–కొత్తపేట ఊరకుంట వద్ద చేపడుతున్న మినీ ట్యాంక్‌బండ్‌ పనులను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం సమీపిస్తున్నందున త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ప్రవీణ్‌నాయక్‌, సీతారాంరెడ్డి, సురేశ్‌, బాలరాజు, అన్నపూర్ణ, శివ, సతీ శ్‌, రఘుపతి, భగవాన్‌, రాంబాబు, మురళి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

నెహ్రూసెంటర్‌: అత్యవసర అంబులెన్స్‌ 108 పైలెట్స్‌ విధుల్లో అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించాల ని 108 జిల్లా మేనేజర్‌ బత్తిని మహేశ్‌ అన్నారు. అంతర్జాతీయ పైలెట్స్‌ దినోత్సవ వేడుకలను సోమవారం కార్యాలంయలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. పైలెట్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం సీనియర్‌ పైలెట్లను సన్మానించారు. కార్యక్రమంలో 108 పైలెట్లు చాపల శివప్రసాద్‌, బూర్గుల రమేశ్‌, నెహ్రూనాయక్‌, సతీశ్‌, ప్రేమ్‌చంద్‌, సంతోశ్‌, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

కనుమరుగవుతున్న

ఏళ్లనాటి వృక్షాలు..

కేసముద్రం: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న ఏళ్లనాటి భారీ వృక్షాలను తొలిగిస్తున్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రంస్టేషన్‌ నుంచి కేసముద్రంవిలేజ్‌ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపులా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్న భారీ వృక్షాలను యంత్రాల సాయంతో కట్‌చేస్తూ తొలిగిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లపాటు నీడనిచ్చిన చెట్లు కనుమరుగవుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు రోడ్డు విస్తరణతో వాహనాల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యమైన విత్తనాలు

విక్రయించాలి

మహబూబాబాద్‌ రూరల్‌: విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎరువులు, పురుగు మందులు, విత్తన డీలర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విత్తన డీలర్లు నకిలీ విత్తనాలను రైతులకు అంటగడితే చర్యలు ఉంటాయని, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్టాక్‌ రిజిస్టర్‌, స్టాక్‌ బోర్డు ప్రతీరోజు అప్‌డేట్‌ చేయాలని తెలిపారు. తహసీల్దార్‌ రాజేశ్వర్‌ రావు, రూరల్‌ ఎస్సై దీపిక, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, ఏఈఓ సాయిప్రకాశ్‌, డీలర్ల అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వేమిశెట్టి సోమయ్య, డీలర్లు పాల్గొన్నారు.

కఠిన చర్యలు చేపడుతాం..

గార్ల: ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే విత్తన డీలర్లపై చర్యలు తప్పవని మహబూబాబాద్‌ ఏడీఏ శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం గార్లలో జరిగిన డీలర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో తహసీల్దార్‌ శారద, ఎస్సై ఎస్‌కె.రియాజ్‌పాషా, ఏఓ రామారావు, ఏఈఓ కిరణ్‌, డీలర్లు లింగాల ఉమేశ్‌, విద్యాసాగర్‌, మనోజ్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

టీచర్ల శిక్షణ శిబిరం మార్పు

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో మంగళవారం(నేడు) నుంచి ఈ నెల 31 వరకు నిర్వహించనున్న ఉన్నత పాఠశాలల టీచర్ల శిక్షణకు సంబంధించి శిబిరాన్ని హసనపర్తి మండలం ఎర్రగట్టుగుట్ట వద్ద గ్రీన్‌వుడ్‌ పాఠశాలకు మార్చినట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉపాధ్యాయులకు, అలాగే ఉమ్మడి జిల్లాలోని భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు తొలుత పెద్దపెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో శిక్షణ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనివార్య కారణాలతో శిక్షణ వేదిక మార్చినట్లు పేర్కొన్న డీఈఓ.. ఈ విషయాన్ని సంబంధిత ఉపాధ్యాయులు గమనించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement