
పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఏడీఆర్ఎం గోపాలకిషన్ అన్నారు. రైల్వే మూడో లైన్ పనుల్లో జాప్యం జరుగుతుందనే కోణంలో ఈ నెల 21న సాక్షి దినపత్రికలో ‘నత్తతో పోటీ!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై రైల్వే అధికారులు స్పందించారు. ఈమేరకు సికింద్రాబాద్ ఏడీఆర్ఎం గోపాలకిషన్ సోమవారం ప్రత్యేక రైలులో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుని మూడో లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా మూడో లైన్ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఎల్.సీ 80 గేటు ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణం, అదేవిధంగా మరికొద్ది దూరంలో ఆర్వోబీ నిర్మాణం, కొత్త బజార్ నుంచి పాత బజార్ వైపునకు రైల్వే స్టేషన్ బయట ప్రాంతాల నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల హాల్టింగ్ విషయంపై జీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రయాణికులకు సహకరిస్తామని తెలిపారు. సీనియర్ డీఈఎన్ దినకర్, డీఓఎన్ సుధీర్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్లు రామారావు, వంశీకృష్ణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్, స్టేషన్ సూపరింటెండెంట్ కనకరాజు, ఎస్ఎస్ఈ పీవే అధికారి ఆలం, ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని, జేఈ పాండునాయక్ తదితరులు ఉన్నారు.
సికింద్రాబాద్ ఏడీఆర్ఎం గోపాలకిషన్
రైల్వే మూడో లైన్ నిర్మాణ
పనుల పరిశీలన

పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు