మెగా పీటీఎంతో ఇబ్బందులు..
ఈ నెల ఐదో తేదీన ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెగా పీటీఎంను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నిధులు ఈ సమావేశాలకు ఏమాత్రం సరిపోవు. ప్రధానంగా ఏకోపాధ్యాయ పాఠశాలలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ విద్యాసంస్థలో పని చేసే ఉపాధ్యాయునికి అన్ని రకాలుగా సమస్యలు ఎదురవుతున్నాయి. దానికి తోడు ఈ సమావేశం తేదీని హడావుడిగా ప్రకటించారు. అలాగే ఆరో తేదీ నుంచి పదో తరగతి విద్యార్థుల వంద రోజుల షెడ్యూల్ను ప్రకటించారు. ఇవన్నీ ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి.
– ఎంవీ మహాంకాళీశ్వరరావు,
అధ్యక్షుడు, వైఎస్సార్ టీఏ, కృష్ణాజిల్లా


