
నేతన్నలకు ఉచిత విద్యుత్ ఏది?
జగన్మోహన్రెడ్డి హయాంలో నేతన్నలకు ఏడాదికి రూ.24వేలు చొప్పున అందజేశారు. ఆర్థికంగా నేతన్నలు కోలుకున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను సైతం నేతన్నలు ఎదుర్కొని నిలబడ్డారంటే జగన్ పుణ్యమే. ఐదేళ్ల పాటు నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో నేత కార్మికుడు రూ.1.20లక్షల చొప్పున పొందారు. ఈ ప్రభుత్వంలో నేతన్నలకు ఉచిత విద్యుత్ అంటూ పేర్కొంది. 200యూనిట్లు వరకు ఉచితమంది. దీనికి సంబంధించి ఎటువంటి విధివిధానాలు విడుదల చేయకుండా నేతన్నలను దగా చేస్తోంది.
– యర్రా టార్జన్, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు