చిలకలపూడి(మచిలీపట్నం): పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆమె గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జే.జ్యోతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సిహెచ్.వీరాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బాస్కెట్బాల్ పోటీల విజేత కృష్ణా బాలికలు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అండర్ 23 రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు గురువారం ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల బాలురు, బాలికలు పాల్గొన్నారు. బాలురు విభాగంలో అనంతపురం జట్టు విన్నర్గా, చిత్తూరు రన్నర్గా నిలవగా మూడవ స్థానంలో తూర్పుగోదావరి జట్టు నిలిచింది.
అదే విధంగా బాలికల విభాగంలో కృష్ణా విన్నర్స్గా, తూర్పు గోదావరి రన్నర్స్గా, మూడవ స్థానంలో పశ్చిమ గోదావరి జట్టు నిలిచాయి. విజేతలకు ఏపీ బాస్కెట్బాల్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెంగల్రాయనాయుడు, తదితరులు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత