
నాడు
కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితి తారుమారైంది. సామాజిక పింఛన్లు మినహా ఏ ఒక్క సంక్షేమ పథకం అందలేదు. సూపర్సిక్స్ హామీలను విశ్వసించిన పేద, మధ్యతరగతి వర్గాలు భంగపాటుకు గురయ్యాయి. హామీల పేరుతో గద్దెనెక్కి వాటిని అటకెక్కించారంటూ ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. కూటమి మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. నయవంచన పాలనపైపెదవి విరుస్తూ, గత ప్రభుత్వ సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటున్నాయి.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటి గడపనూ సంక్షేమం పలకరించింది. ఏడాది పొడవునా అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న చేదోడు, ఆసరా అంటూ అనేక పథకాలను అందరికీ అందించింది. పేద, మధ్యతరగతి వర్గాలు ఆ ఫలాలతో ఆనందంగా జీవించాయి. పిల్లల చదువుల దగ్గర నుంచి కుటుంబ జీవనం వరకూ ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగిపోయింది. ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసింది.
నేడు
కూటమి ఏడాది పాలనలో బతుకులు ఛిద్రం సూపర్ సిక్స్ పథకాల ఊసే ఎత్తని ప్రభుత్వం నమ్మి మోసపోయామంటూ ఆవేదన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోప్రతి కుటుంబానికి లబ్ధి నాటి సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి వారికి ఆర్థిక దన్ను