
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నివార
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పిలుపునిచ్చారు. ప్రంపచ పర్యవవరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం విజయవాడ డివిజన్ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేట్టారు. ఈ సందర్భంగా అధికారులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్వచ్చంద సంస్ధల వలంటీర్లతో కలసి డీఆర్ఎం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా బ్యానర్లు, ప్లాకార్డులతో క్లాక్ టవర్ నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫాం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ వెయిటింగ్ హాల్ వద్ద పర్యావరణ హానికర ప్రభావాలను కళ్లకు కట్టినట్టుగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ప్రదర్శన ఆలోచింపజేసింది. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ పర్యావరణ లక్ష్యాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్చందగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రయాణికులకు క్లాత్ బ్యాగులను అందజేశారు. అనంతరం కృష్ణా కెనాల్లోని శిక్షణ కేంద్రంలో సిబ్బందితో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సీనియర్ డీఈహెచ్ఎం ఎం.కిషోర్, సీనియర్ డీఈ ఎస్.వరుణ్బాబులను ఆయన అభినందించారు.
డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్