
సొంతింటి కల సాకారం..
మహిళలకు సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో కృష్ణాజిల్లా లోని ఏడు నియోజకవర్గాల్లో 90,504 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 1,14,969 మందికి ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. వీరికి ప్రత్యేకంగా కాలనీలను ఏర్పాటు చేసి వారికి అన్నిమౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అప్రోచ్రోడ్డులతో పాటు అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు.
అంతా మాయ..
తాను అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లపట్టాలు అందజేస్తామని ప్రతి ఒక్కరికీ మూడు సెంట్లు భూమిని ఇస్తామని చెప్పి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఏడాది పాలన దగ్గరకావస్తున్నా చెప్పిన హామీని అమలు చేయకుండా వారి సొంత ప్రయోజనాలకు మాత్రమే పాలన ఇప్పటి దాకా కొనసాగించారు.