
ఎన్టీఆర్కు కలెక్టర్ నివాళి
చిలకలపూడి(మచిలీపట్నం): మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా బుధవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లాస్థాయి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకె బాలాజీ, అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తొలుత శివజ్యోతి విద్యాలయ నాట్యబృందం ఆధ్వర్యంలో చిన్నారులు నృత్యం ప్రదర్శించారు. గేయాలు ఆలపించారు. రోషితశ్రీవల్లిక కళ్లకు గంతలు కట్టుకుని గుర్తింపుకార్డులు చదవటం, హాలులో ప్రత్యేకంగా వ్యక్తులను గుర్తించటం, చూడకుండా బోర్డుపై చి త్రాన్ని గీయటం, సైకిల్ తొక్కటం వంటి ప్రదర్శన లు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఎన్టీఆర్ జీవిత విశేషాలతో సమాచార పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీవో కె.స్వాతి, జెడ్పీ ఇన్చార్జ్ సీఈవో ఆనంద్కుమార్, బండి రామకృష్ణ, గోపీచంద్, దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో...
కోనేరుసెంటర్: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఎస్పీ ఆర్.గంగాధరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, డీఎస్పీ సీహెచ్ రాజా, సీఐలు, ఎస్ఐలు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
71 మంది రక్తదానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వలంటరీ బ్లడ్ డోనార్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరం జరిగింది. శిబిరాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రారంభించారు. శిబిరంలో అసోసియేషన్ ప్రతినిధులు 71 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలను నీలం సాహ్ని ప్రత్యేకంగా అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు, ఎన్నికల కమిషన్ జాయింట్ సెక్రటరీ జీవీ సాయిప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మదన్మోహన్ పాల్గొన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో
రెండు గేదెలు మృతి
నందివాడ: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండు గేదెలు మృతిచెందిన ఘటన ఇలపర్రు పంచాయతీ లక్ష్మీనరసింహాపురంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్.ఎన్.పురం గ్రామానికి చెందిన రైతులు హనుమంతు సుబ్బారావు, ఎన్.నాగరాజుకు చెందిన రెండు పాడి గేదెలు మేతకు వెళ్తూ విద్యుత్ తీగలు కాళ్లకి చుట్టుకుని మరణించాయి. ఈ గేదెల విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని రైతులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.