
మోటార్సైకిళ్ల దొంగలు అరెస్ట్
కృత్తివెన్ను: జల్సాలకు అలవాటు పడి వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన మోటారుసైకిళ్లను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను కృత్తివెన్ను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై మచిలీపట్నం రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ బుధవారం కృత్తివెన్ను పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పల్లెపాలెం పెన్నేరు వంతెన వద్ద స్థానిక పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని మోటార్బైక్తో తిరగడాన్ని గమనించారు. అనుమానం వచ్చి వారిని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమ వరం మండలం యనమదుర్రు గ్రామానికి చెందిన విల్లూరి సుధీర్బాబు ఏడు మోటార్సైకిళ్లను దొంగిలించి పడతడికి వెళ్లే దారిలో ముళ్లపొదల్లో దాచా డు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని అతనికి సహకరించిన మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఎస్ఐ పైడిబాబుతో పాటు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి రివార్డు ఇచ్చినట్లు తెలిపారు.
ఏడు బైక్లు స్వాధీనం