
జాతీయ స్థాయి కూచిపూడి నృత్యంలో జెడ్పీ విద్యార్థిని ప్రత
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని సంపసాల శ్రావ్య జాతీయ స్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో తృతీయ స్థానంలో నిలిచింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కళా నిలయం సంస్థ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన 40వ జాతీయ నవరస శాసీ్త్రయ జానపద సంగీత నాట్య కళారూపాల ప్రదర్శనలో జూనియర్ విభాగంలో ఉత్తమ ప్రదర్శనతో శ్రావ్య ఈ ఘనత సాధించింది. సంస్థ నిర్వాహకులు మంగళవారం నిర్వహించిన ముగింపు సభలో మెమెంటో, ప్రశంసాపత్రాన్ని ఆమెకు అందజేశారు. గతంలో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిలో జరిగిన జాతీయ స్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో తృతీయ స్థానం, దాక్షారామంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో నాట్య రవళి బిరుదు ఆమె అందుకుంది. ప్రముఖ దేవాలయాల్లో అనేక కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. పాఠశాల హెచ్ఎం పద్మలత, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.