
అందుబాటులోకి తేవాలి
వరదలకు రైతులు బాగా నష్టపోయారు. మా గ్రామ రైతుల పొలాలకు కూడా ఎత్తిపోతల పథకం నీళ్లు అవసరం ఉంది. సాగర్ జలాలు రాకపోతే ఎత్తిపోతల పథకం నీళ్లే రైతులకు ఉపయోగపడతాయి. తప్పని సరిగా ఎత్తిపోతల పథకాన్ని తక్షణం ప్రభుత్వం మరమ్మతులు చేయించి అందుబాటులోకి తేవాలి.
–పాపినేని శ్రీనివాసరావు, రైతు, సుబ్బాయిగూడెం
అంచనాలు పంపాం
రూ.16 లక్షలతో అంచనాలు రూపొంది పంపించాం. వరదల కారణంగా ఎత్తిపోతల పథకంలో మోటార్లు, ప్యానల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. స్తంభాలు వరద నీటిలో కొట్టుకు పోయాయి. కొంతవరకు రైతులు మరమ్మతులు చేయించుకుంటున్నారు. సీజన్ నాటికి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందిస్తాం.
– ప్రభాకర్, ఏఈ, ఐడీసీ
●