
పోలీస్ ప్రజావాణిలో 81 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 81 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కృష్ణమూర్తినాయుడు తెలిపారు. ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 39, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి ఏడు, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి ఏడు, దొంగతనాలకు సంబంధించినవి నాలుగు, కొట్లాటకు సంబంధించినవి ఐదు, సైబర్ నేరాలకు సంబంధించి ఐదు, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 14 ఫిర్యాదులను స్వీకరించినట్లు చెప్పారు. బాధితులతో మాట్లాడటంతో పాటు, దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశించినట్లు చెప్పారు.