
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 25కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10,381 మంది అభ్యర్థులకు గాను ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ నిర్వహించిన పేపర్–1కు 5,716 (55.1 శాతం) మంది, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ జరిగిన పేపర్–2కు 5,665 (54.6 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సక్రమంగా ప్రశాంతంగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో జరిగిన పరీక్షను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. అలాగే పరీక్ష జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు.
హాజరైన 55 శాతం అభ్యర్థులు 25 కేంద్రాల్లో కొనసాగిన పరీక్ష పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ