
సాంకేతిక విద్య మిథ్య..!
● జిల్లాలో కానరాని పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు ● ఉద్యోగావకాశాలు కోల్పోతున్న విద్యార్థులు ● విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్
తిర్యాణి: జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి సాంకేతిక విద్య ఒక ఆయుధంలా పని చేస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి విపరీతమైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. అన్ని రంగాల్లో వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విద్య అందించే ప్రభుత్వ కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలో ఉన్న ఏకై క ప్రైవేట్ ఐటీఐ కళాశాల మినహా మరెక్కడా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు లేకపోవడం విద్యారంగంలో జిల్లా వెనుకబడిన తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఉద్యోగ అవకాశాలు..
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ), పా లిటెక్నిక్ కోర్సుల ద్వారా విద్యార్థులు తక్కువ స మయంలోనే ఉద్యోగావకాశాలు పొందే అవకా శం ఉంది. ఇప్పటివరకు జిల్లాలో కేవలం ఒకేఒక్క ప్రైవేట్ ఐటీఐ కళాశాల మాత్రమే ఉంది. ప్రభుత్వానికి చెందిన సాంకేతిక కళాశాలలు లేకపోవడంతో ఉన్నత చదువులు చదివే స్థోమత లేక జీవి తంలో తొందరగా స్థిరపడాలనుకునే విద్యార్థుల కు అందుకు అనువైన అవకాశాలు లేకుండా పో తున్నాయి. ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు చదవా లంటే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ ఐ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్థానికంగా ఉన్న సింగరేణి సంస్థ వేతనంతో కూడిన శిక్షణ (అప్రెంటిషిప్) ఇవ్వడానికి ముందుకు వస్తోంది. ఆర్టీసీ వంటి అనేక సంస్థలు కూడా ఐటీఐ విద్యార్థులకు తమ సంస్థల్లో అవకాశాలు కల్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి. అంతే కాకుండా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు సొంతంగా పరిశ్రమ పెట్టుకుని స్వయం ఉపాధితో స్థిరపడే అవకాశం ఉన్నందున ఐటీఐ వంటి కోర్సులు చేసేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.
జిల్లా విద్యార్థులకు ప్రయోజనం..
వెనుకబడిన జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. స్థానికంగా కళాశాలలు లేకపోవడంతో ఇతర జి ల్లాలకు వెళ్లి ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులను అభ్యసిస్తున్నారు. కాగా జిల్లాలో 2024 –25 విద్యా సంవత్సరానికి గాను 6వేలకు పైగా మంది విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. వారందరికీ సాంకేతిక కోర్సుల్లో చేరడానికి అర్హత ఉంటుంది. వీరితో పాటు ఇంటర్ చదివిన విద్యార్థులు సైతం ఈ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. కాగా ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, ఉట్నూర్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నప్పటికీ దూరభారంతో పాటు సీట్లు కూడా సరిపోక జిల్లా విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు.
విద్యారంగం అభివృద్ధి చెందాలి
విద్యారంగంలో అత్యంత వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించాలి. జిల్లాలో సాంకేతిక కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల సాధనకు విద్యార్థి సంఘాలు అన్ని ఐక్యమై దశలవారీగా ఉద్యమాలు చేపడుతాం.
– జగజంపుల తిరుపతి,
పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి

సాంకేతిక విద్య మిథ్య..!