
● బిల్లులు రాక నిలిచిన పథకం ● నెమ్మదిగా సాగుతున్న ‘అమ్మ
పూర్తికాని మరుగుదొడ్లు
ఆసిఫాబాద్ మండలంలోని కొమ్ముగూడ ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు రూ.1.20 లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు విద్యుత్ పనులు పూర్తికాగా, తాగునీరు, టాయిలెట్ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. పూర్తయిన పనులకు రూ.95 వేలు ఖర్చు చేసినట్లు బిల్లులు తీసుకున్నారు.
నిరుపయోగంగా టాయిలెట్స్
దహెగాం: మండలంలోని 52 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా 3,450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐనంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8 తరగతుల్లో సుమారు 220 మంది విద్యార్థులున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన వరదతో టాయి లెట్లలో బురద చేరడంతో నిరుపయోగంగా మా రాయి. ప్రహరీ సైతం కూలిపోయింది. అప్పటినుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. మరో భవనం నిర్మాణానికి రూ.63 లక్షలు మంజూరయ్యాయని ఉపాధ్యాయులు తెలిపారు. పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
కొనసాగుతున్న పనులు
పెంచికల్పేట్: పెంచికల్పేట్ జిల్లా పరిషత్ పాఠశాలకు ప్రభుత్వం పీఎం శ్రీ పథకంలో భాగంగా సైన్స్ ల్యాబ్ మంజూరు చేసింది. విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రయోగాలు చేయడానికి సామగ్రి సైతం కేటాయించారు. కొ న్ని నెలల క్రితం కాంట్రాక్టర్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాడు. ప్లాస్టింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో పది రోజుల్లో పనులు పూర్తి చేసి నూతన విద్యా సంవత్సరానికి భవనం అందుబాటులో తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
దహెగాం మండలం ఐనంలోని ప్రాథమికోన్నత పాఠశాల
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,263 ఉండగా, 84,855 విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పా ఠశాలల పథకం కింద జిల్లాలోని అన్ని యాజ మాన్యాల కింద ఉన్న 727 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా చిన్నపాటి మరమ్మతులు, విద్యుత్, తాగునీరు, టైల్స్ వంటి పనులు చేపట్టేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. విద్యుత్, తాగునీటి పనులు 90శాతం వరకు పూర్తయ్యాయి. ఇక మరుగుదొడ్లు, ఇతర మేజర్ పనులు మాత్రం 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే పూర్తయ్యాయి. 727 పాఠశాలలకు రూ.25.60 కో ట్లు మంజూరయ్యాయి. 623 పాఠశాలలో తాగునీటి వసతులు, 202 పాఠశాలల్లో చిన్న తరహా మరమ్మతులు, 15 అర్బన్ పాఠశాలల్లో కొత్త మరుగుదొడ్లు, 140 గ్రామీణ పా ఠశాలల్లో టాయిలెట్లు మరమ్మతు, 607 పాఠశాలలో విద్యుత్ పనుల కో సం ఇప్పటివరకు రూ.18.28 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.6.52 కోట్లుకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంది.
78 స్కూళ్లలోనే ‘మన ఊరు– మన బడి’
గత ప్రభుత్వం మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.75 కోట్లతో జిల్లాలోని 251 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. అయితే 78 సూళ్లలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మరో 173 పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పనులకు సంబంధించిన నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే ఆపేశారు. ఈ 251 పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద ఎంపిక చేయలేదు. దీంతో ఆయా చోట్ల పనులు ముందుకు సాగడం లేదు.
చివరి పనులు పెండింగ్
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని 51 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు చేపట్టారు. శంకర్గూడ, కర్పెతగూడ, ఆగర్వాడ, లేండిగూడ పాఠశాలల్లో చివరి పనులు పెండింగ్ ఉన్నాయి. పెయింటింగ్, విద్యుత్ పనులు పూర్తికాలేదు. మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. పాఠశాలల ప్రారంభంలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఏఈ నజీమోద్దీన్ తెలిపారు.
దెబ్బతిన్న పైకప్పు
చింతలమానెపల్లి: మండలంలోని బాబాసాగర్, డబ్బా పాఠశాలల్లో మన ఊరు– మన బడి పథకం కింద మంజూరైన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కేంద్ర నిధులతో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణాలు పూర్తి కాలేదు. డబ్బా ప్రాథమిక పాఠశాల పైకప్పు రేకులు దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టలేదు.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు– మన బడి పథకం కింద చేపట్టిన పనులు బిల్లులు రాక నిలిచిపోయాయి. మరోవైపు కాంగ్రెస్ సర్కారు అమ్మ ఆదర్శ పాఠశాలలు కార్యక్రమం కింద చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. జూన్ 12న ప్రభుత్వ బడులు తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ఈ ఏడాది ముందే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బడుల్లో మరమ్మతులు సకాలంలో పూర్తికావడం అనుమానంగా మారింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై ‘సాక్షి’ విజిట్..

● బిల్లులు రాక నిలిచిన పథకం ● నెమ్మదిగా సాగుతున్న ‘అమ్మ

● బిల్లులు రాక నిలిచిన పథకం ● నెమ్మదిగా సాగుతున్న ‘అమ్మ

● బిల్లులు రాక నిలిచిన పథకం ● నెమ్మదిగా సాగుతున్న ‘అమ్మ

● బిల్లులు రాక నిలిచిన పథకం ● నెమ్మదిగా సాగుతున్న ‘అమ్మ

● బిల్లులు రాక నిలిచిన పథకం ● నెమ్మదిగా సాగుతున్న ‘అమ్మ

● బిల్లులు రాక నిలిచిన పథకం ● నెమ్మదిగా సాగుతున్న ‘అమ్మ

● బిల్లులు రాక నిలిచిన పథకం ● నెమ్మదిగా సాగుతున్న ‘అమ్మ