
నీటి సంప్లో పడి చిన్నారి మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని రేగులచలకలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని నీటి సంప్లో ప్రమాదవశాత్తు పడిన చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రేగులచలకకు చెందిన ఆటో డ్రైవర్ సత్తి నరేష్–వినోద్ కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రీరాజ్యవి (5) ఇంటి ముందు అడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడి నీటి సంప్లో పడింది. తల్లి ఇంటి పనుల్లో ఉండగా ఈ విషయాన్ని గుర్తించలేదు. కాసేపటి తర్వాత చిన్నారి ఎటు వెళ్లిందోనని ఆరా తీస్తుండగా సంప్లో కనిపించడంతో బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అంతసేపు కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్షరీఫ్ తెలిపారు.
ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం
నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నిరుపేదనైన తన పేరు లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. మండలంలోని మంగాపురంతండాకు చెందిన ధరావత్ కేశ్యా పేరు జాబితాలో పేరు సోమవారం ఆయన పంచాయతీ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. గ్రామస్తులు అడ్డుకోవటంతో వెనక్కి తగ్గినప్పటికీ ఆ కాసేపటికి ఒంటిపై పోసుకోగా స్థానికులు అడ్డుకుని ఇంటికి తీసుకెళ్లారు.
మోకాళ్ల పై కూర్చుని నిరసన
కారేపల్లి: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదంటూ కారేపల్లి మండలం పేరుపల్లిలో పలువురు అంబేడ్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. రేకుల ఇళ్లలోఉంటున్న తాము కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నా ఇళ్లు మంజూరు ఏయలేదని వాపోయారు. కొందరి స్వార్ధంతో ఈ పరిస్థితి ఎదురైనందున అధికారులు స్పందించాలని కోరారు. ఈకార్యక్రమంలో స్థానికులు పప్పుల నిర్మల, పప్పుల వెంకటేశ్వర్లు, అజ్మీరా సరిత, శంకర్, ధరా బక్కయ్య, అజ్మీరా నగేష్, ధారా రాంబాబు, పాయం బిక్షపతి, రవి, గుగులోతు సుభద్ర, కోటం నాగమణి, అజ్మీరా లక్ష్మి, విక్రమ్, గడ్డి రేణుక తదితరులు పాల్గొన్నారు.