
జిల్లా వ్యాప్తంగా వాన
ఖమ్మంవ్యవసాయం: రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం శుక్రవారం ఉదయం 8–30 నుంచి శనివారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లాలో సగటున 20.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కారేపల్లి మండలంలో 76.8 మి.మీ.లు, కామేపల్లి మండలంలో 73.4, తల్లాడలో 52.4, ఏన్కూరులో 49.2, పెనుబల్లిలో 38.2, వేంసూరులో 32.2, వైరాలో 20, కల్లూరులో 15.4, సత్తుపల్లిలో 10.6, కొణిజర్లలో 10.2 మి.మీ. వర్షపాతం నమోదైందని నివేదికలో పేర్కొన్నారు.