
పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి
ఖమ్మం సహకారనగర్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తాల సత్యనారాయణ కోరారు. పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యాన చేపట్టిన ప్రచార జాతాను ఖమ్మం జెడ్పీ సెంటర్లో టీజీవోస్ కార్యదర్శి మోదుగు వేలాద్రి, నాయకులతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందుతాయని తెలిపారు. ఈనేపథ్యాన తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావుతో పాటు బుర్రి వెంకన్న, షరీఫ్, శ్రీనివాస్, శ్యాంకుమార్, రోజా, నర్సింహారావు, సాంబమూర్తి, రాంబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.