
రహదారులే బారులు
‘మందు బాబులం.. మేము మందుబాబులం.. రోడ్డుపైనే వాహనం నిలుపుతాం, ఆ పక్కనే మందు కొడతాం, చిందులు వేస్తాం.. మాకు అడ్డొచ్చేదెవరు..’ అన్న చందంగా మద్యపాన ప్రియులు వ్యవహరిస్తున్న తీరు ఇతరుల ఇబ్బందులకు కారణమవుతోంది. జిల్లా కేంద్రంలోని పలు వైన్స్, బార్ల వద్ద పరిస్థితులను ‘సాక్షి’ శనివారం రాత్రి పరిశీలించింది. ఈసందర్భంగా చాలాచోట్ల ఇష్టమున్నట్లు వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుండగా.. వైన్స్ వెంట ఖాళీ స్థలాల్లోనే పలువురు దర్జాగా మందు తాగుతుండడం కనిపించింది. ఇదంతా ప్రధాన రహదారుల వెంటే జరుగుతున్నా అటు ఎకై ్సజ్, ఇటు పోలీసు అధికారులు పట్టించుచుకోకపోవడం గమనార్హం. – ఖమ్మం క్రైం
మద్యపాన ప్రియులకు రోడ్లు, పార్క్లే అడ్డా
● వైన్స్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు సామాన్యుల సతమతం ● అయినా పట్టించుకోని పోలీస్, ఎకై ్సజ్ శాఖలు
స్టేడియం, పార్క్లకు వెళ్లే వారి అవస్థలు
ఖమ్మంలోని పటేల్ స్టేడియంతో పాటు పలుచోట్ల పార్క్ల సమీపాన వైన్స్ ఉన్నాయి. స్టేడియంలో ప్రాక్టీస్కు వచ్చిన క్రీడాకారులు ఒకేసారి రాత్రి 7 నుంచి 8గంటల మధ్య బయటకు వస్తారు. వేసవిలో ఈ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే, స్టేడియం సమీపాన వైన్స్, లిక్కర్ మార్ట్లు ఉండగా.. ఇదే సమయానికి అక్కడా పలువురు బారులు దీరుతారు. ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కానీ వాహనదారులను నియంత్రించే వారు కానీ లేకపోవడంతో రోడ్డుపైనే వాహనాలు నిలిపి వైన్స్లోకి వెళ్లడం ఆనవాయితీగా మారింది. దీంతో దాదాపు ప్రతీరోజు రాత్రి ఇక్కడ ట్రాఫిక్ ఇక్కట్లు సర్వసాధారణమయ్యాయి. దీనికి తోడు ఈ ప్రాంతంలో ఓ వైన్స్ పక్కన ఖాళీ స్థలాన్ని కొందరు అడ్డాగా మార్చుకుని అక్కడే మందు తాగుతుండడంతో రహదారి మీదుగా వచ్చివెళ్లే మహిళలు, స్టేడియం నుంచి వచ్చే క్రీడాకారులు అవస్థ పడాల్సి వస్తోంది. పలుమార్లు మందుబాబులు అసభ్యంగా మాట్లాడుతుండడం, మత్తులో తూలుతూ వాహనాలు నడుపుతుండడంతో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది.
అధికారులు ఏం చేస్తున్నారు?
జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, స్టేడియం, పార్క్లకు సమీపాన ఉన్న వైన్స్, బార్ల ముందు మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా వ్యాపారం ఎందుకు కోల్పోవాలని నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. అయితే, ఈ రహదారుల్లో వచ్చివెళ్లే ఎకై ్సజ్, పోలీసు అధికారులు కూడా పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలనెలా మామూళ్లు వస్తుండడంతోనే ప్రజల ఇబ్బందులతో తమకేం పని అన్నట్లు వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. నడిరోడ్డుపై ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోల్లో కూర్చోని మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నా పట్టీపట్టనట్లు వ్యహరించడం సరికాదని.. ఇకనైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
మా దారి.. రహదారి..
సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఖమ్మంలోని కొన్ని వైన్స్షాప్ల ముందు నుంచి నడవాలంటే మహిళలు, చిన్నారుల మాటేమో కానీ పురుషులైనా ఓసారి ఆలోచించాల్సిందే. నడిరోడ్డుపైనే ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసి మద్యం తెచ్చుకోవడానికి దుకాణంలోకి వెళ్లడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నా అటు వైన్స్ యాజమాన్యాలకు, ఇటు మందు బాబులకు పట్టడం లేదు.

రహదారులే బారులు

రహదారులే బారులు

రహదారులే బారులు

రహదారులే బారులు