
రైతులకు వ్యవసాయ సలహాలివ్వాలి
రాయచూరు రూరల్: జిల్లాలో రైతులకు వ్యవసాయంపై శాస్త్రవేత్తలు సలహాలివ్వాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప సూచించారు. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద ఖరీఫ్ సీజన్ విత్తనాల అభియాన్ను వికసిత వ్యవసాయ సంకల్ప అభియాన్ జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వ్యవసాయ అంశాల గురించి రైతులకు వివరించాలన్నారు. 15 రోజుల పాటు జరిగే జాతా సందర్భంగా గ్రామాల్లో పర్యటించాలన్నారు. జాతాలో అధికారులు దురుగేష్, స భ్యులు మధుసూదన్, మల్లేష్, మధుసూదనరెడ్డిలున్నారు.