వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు

May 27 2025 12:45 AM | Updated on May 27 2025 12:45 AM

వ్యవస

వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా ఇతర దేశాలతో పోటీ పడేలా వ్యవసాయంపై పరిశోధనలు జరపాలని రాష్ట్ర గవర్నర్‌, చాన్సలర్‌ ధావర్‌చంద్‌ గెహ్లాట్‌ పిలుపు ఇచ్చారు. సోమవారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవాన్ని జిందాల్‌లో వర్చువల్‌ పద్ధతి ద్వారా ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 25 ఏళ్ల నాటికి అమెరికా కంటే భారత్‌ ఆహార పదార్థాల ఉత్పత్తిలో ముందుండాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచుకొని అమెరికాను మించిపోవాలన్నారు.

మంచి పేరు తేవాలి

నేడు పర్యావరణం, జలసంరక్షణ, వాయు సంరక్షణలపై ఆలోచించాలన్నారు. నేటి విద్యా రంగం కేవలం ఉద్యోగం కోసం కాకుండా స్వయం ఉపాధికి తోడు నలుగురికి ఉపయోగ పడే విధంగా జీవితాన్ని రూపొందించుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ముఖ్య అతిథి, భారతీయ విశ్వ విద్యాలయాల వేదిక మహా కార్యదర్శి పంకజ్‌ మిత్తల్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వ్యవసాయ పథకాల గురించి మహిళా రైతులకు వివరించాలన్నారు. సిరిధాన్యా(మిల్లెట్‌)ల సాగు ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి నాబార్డ్‌ రూ.25 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు.

రైతులకు డాక్టరేట్‌

రైతులకు డాక్టరేట్‌ అవార్డులను ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. 352 మంది డిగ్రీ విద్యార్థులకు,136 మంది పీజీ విద్యార్థులకు, 19 మంది విద్యార్థులకు డాక్టరేట్‌ పట్టాలు అందించారు. పుట్టరాజ్‌కు ఆరు బంగారు అవార్డులు, సుశ్మితకు మూడు బంగారు అవార్డులు, రైతు దేవేంద్రప్ప శంకరప్పకు డాక్టరేట్‌ ప్రదానం చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి, వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌ హనుమంతప్ప, రిజిస్ట్రార్‌ దురుగేష్‌, అధికారులున్నారు.

గవర్నర్‌, మంత్రి గైర్హాజరు

రాష్ట్రంలో వానలు కురుస్తుండడంతో బెంగళూరు నుంచి రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం 14వ స్నాతకోత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్న హెలికాప్టర్‌లో బయల్దేరిన గవర్నర్‌, మంత్రి బళ్లారి జిల్లా జిందాల్‌లో దిగారు. అక్కడ విశ్రాంతి పొందుతున్న తరుణంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో జిందాల్‌ విశ్రాంతి గదిలో నుంచే వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. మరో వైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి కూడా వర్సిటీ స్నాతకోత్సవానికి గైర్హాజరయ్యారు.

జిందాల్‌ నుంచి వర్చువల్‌ పద్ధతిలో శ్రీకారం

వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌

వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు 1
1/3

వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు

వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు 2
2/3

వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు

వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు 3
3/3

వ్యవసాయంపై లోతైన పరిశోధనలకు పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement