
దేశ సరిహద్దులను కాపాడుకోవాలి
రాయచూరు రూరల్: భక్తులు దేవాలయంలో దేవుడిని ఎలా పూజిస్తారో దేశ సరిహద్దులను కూడా అలానే కాపాడుకోవాలని సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య పేర్కొన్నారు. ఆయన సోమవారం సాయంత్రం నేతాజీ నగర్ సర్కిల్లో కొవ్వొత్తుల ర్యాలీకి శ్రీకారం చుట్టి మాట్లాడారు. శాంతికపోతంగా ఉన్న భారతదేశంలోని కశ్మీర్ హిందువుల మారణ హోమాలకు ఇస్లాం ఉగ్రవాదులు కారణమన్నారు. కశ్మీర్ ప్రాంతంలో బైసారన్, పహల్గాంల మధ్య దుండగులు జరిపిన కాల్పుల్లో దుర్మార్గులు దాడిలో హతులైన వారికి హిందూ హిత రక్షణ సమితి ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేఽశారు. చౌక్ వద్ద కాగడాలను పట్టుకొని అధ్యక్షుడు అనంద్ ఫడ్నీస్ మాట్లాడారు. కశ్మీర్లోని పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారికి ఉరిశిక్ష వేయాలన్నారు. ర్యాలీలో శాంతమల్ల శివాచార్య, వీర సంగమేష్ శివాచార్య, శంభు సోమనాథ శివాచార్య, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, లలిత, బండేష్, శంకర్రెడ్డి, రవీంద్ర కుమార్లున్నారు.
పహల్గాం ఉగ్రదాడిలో
మృతులకు సంతాపం
హిందూ హిత రక్షణ సమితి
కొవ్వొత్తుల ర్యాలీ

దేశ సరిహద్దులను కాపాడుకోవాలి