
జంధ్యం తొలగింపుపై నిరసన
హొసపేటె: సీఈటీ పరీక్షల సమయంలో బ్రాహ్మణ విద్యార్థులకు జంధ్యం తొలగించిన సంఘటనపై హొసపేటెలోని బ్రాహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జంధ్యం తొలగింపును ఖండిస్తూ విజయనగర జిల్లాధికారి కార్యాలయం ముందు చేపట్టిన నిరసనలో ఆందోళనకారులు మాట్లాడారు. ఆ ఘటనలతో కేవలం బ్రాహ్మణ సమాజాన్నే కాదు, మొత్తం హిందూ సమాజాన్నే అవమానించారన్నారు. ఈ ఘటనలో కేవలం అధికారులను మాత్రమే సస్పెండ్ చేశారన్నారు. ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం. ఈ ధోరణిని వెంటనే మార్చాలి. ఉద్దేశపూర్వకంగా జంధ్యం తొలగించడం ఆగ్రహాన్ని రేకెత్తించింది. జంధ్యం బ్రాహ్మణ సమాజం హక్కు అని పేర్కొన్నారు.