
యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
మంథని: ఓ యువకుడు మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాతో దాడి చేసిన ఘటన శనివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలు.. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన బొల్లంపల్లి సంతోష్గౌడ్ మంథనిలోని క్రీడా మైదానం సమీపంలో మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఈక్రమంలో కారు, రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వెనక నుంచి సంతోష్ తలపై బీరుసీసాతో దాడి చేశారు. అంతేగాకుండా ఇటుకతో బాది, కాళ్లు, చేతులతో దాడిచేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంతోష్గౌడ్కు స్థానిక సామాజిక వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి గోదావరిఖనికి తరలించారు. కాగా సంతోష్ ఆయా పార్టీలు, అధికారులపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతుంటాడు. అవినీతి, అక్రమాలపై సైతం పోస్టింగ్లు పెడుతుంటాడు. అయితే అతడిపై ఎవరు దాడి చేశారనేది తెలియరాలేదు. పోలీస్స్టేషన్కు సమీపంలోనే దాడి చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.