
చెట్లపసరు తాగి మహిళ మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నేవూరి లలిత(50) చెట్లపసరు తాగి అస్వస్థతకు గురై శుక్రవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి కుమారుడు నేవూరి కళ్యాణ్ ఫిర్యాదుతో పోలీసులు శనివారం కేసు నమోదు నమోదు చేశారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. లలిత కొంతకాలంగా బీపీ, షుగర్తో బాధపడుతోంది. ఈక్రమంలో కుటుంబ సభ్యులు గుర్తుతెలియని వ్యక్తి వద్ద చెట్లపసరు తాగించారు. దీంతో అస్వస్థతకు గురైన లలితను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి భర్త అశోక్రెడ్డి, కుమారుడు కళ్యాణ్ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో మేసీ్త్ర ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు.. అనారోగ్య సమస్యలు భరించలేక ఓ మేసీ్త్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండల కేంద్రానికి పెరుమాండ్ల కృష్ణ(50) నాలుగేళ్ల క్రితం కూతురు పెళ్లి కోసం రూ.4లక్షలు అప్పు చేశారు. మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. పనులు సరిగా లేవు. ఈక్రమంలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో చేయి విరిగింది. అప్పులు తీరే మార్గం కనిపించక గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం వేకువజామున ఇంట్లో నుంచి వెళ్లిన కృష్ణ.. తెర్లుమద్దిచౌరస్తా వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుని భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొండగట్టులో యువకుడి హత్య?
● వివాహ వేడుకల్లో వివాదం
● హత్య చేసి, పూడ్చిపెట్టినట్లు ప్రచారం
● విచారణ చేపట్టిన పోలీసులు?
మల్యాల: మల్యాల మండలంలోని ముత్యంపేట (దిగువ కొండగట్టు)కు చెందిన ఓ యువకుడిని స్థానిక యువకులు హత్య చేసినట్లు సమాచారం. ఈనెల 2న ఓ వివాహ వేడుకల్లో జరిగిన వివాదంతో సుమారు 40కి పైగా దొంగతనాల కేసుల్లో నిందితుడైన యువకుడిని దాదాపు 10మంది యువకులు కలిసి హత్య చేసి, పూడ్చిపెట్టినట్లు కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో శనివారం రాత్రి మల్యాల పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెల్సింది. వారిచ్చిన సమాచారం మేరకు సదరు యువకుడిని పూడ్చిపెట్టినట్లు భావిస్తున్న స్థలాన్ని ఎస్సై నరేశ్కుమార్, సీఐ నీలం రవి పరిశీలించారు. పూర్తి వివరాలను ఆదివారం వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.

చెట్లపసరు తాగి మహిళ మృతి