
ఎన్ఎంఎంఎస్లో మనోళ్ల సత్తా
● జిల్లా నుంచి 74మంది విద్యార్థుల ఎంపిక
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ ఉపకార వేతనాల (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) ఎంపికలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఏటా ప్రతిభా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను గురువారం ప్రకటించారు. జిల్లా నుంచి మొత్తం 74మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా రూ.12వేలు
ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా, గతేడాది నవంబరు 1న నిర్వహించిన ప్రతిభా పరీక్షలో 74 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి ప్రతినెల రూ.1000 చొప్పున ఏటా రూ.12 వేల నగదు అందించనున్నారు. 9,10, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఇలా నాలుగేళ్ల పాటు రూ.48 వేలు కేంద్ర ప్రభుత్వం అందించనుంది. జిల్లా పరిధిలో ఎంపికై న 74 మందికి నాలుగేళ్లలో రూ.35.52 లక్షలు ఉపకార వేతనాల రూపంలో అందనున్నాయి.
సంతోషంగా ఉంది
సాధారణ తరగతులతో పాటు ఉపాధ్యాయులు ప్రతిరోజు నిర్వహించిన ప్రత్యేక తరగతుల్లో మెంటల్ ఎబిలిటీ, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు ప్రధానంగా సన్నద్ధమయ్యాను. నాలుగేళ్ల పాటు వచ్చే ఉపకార వేతనం నా ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. దీంతో మా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఇదే స్ఫూర్తితో ఇతర పోటీ పరీక్షల్లోను ప్రతిభా చూపేందుకు కృషి చేస్తా. – వరికోలు విజ్ఞత,
జెడ్పీహెచ్ఎస్ జూబ్లీనగర్ పాఠశాల