యశోదలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

యశోదలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం

Jun 7 2025 12:07 AM | Updated on Jun 7 2025 12:07 AM

యశోదల

యశోదలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం

కరీంనగర్‌ టౌన్‌: సోమాజిగూడ యశోద హాస్పిటల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్‌ యశోద మెడిక ల్‌ సెంటర్‌లో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహించా రు. నెఫ్రాలజిస్ట్‌ అరుణ్‌ కుమార్‌ పొన్న సుమారు 100 మంది పేషంట్లకు కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్‌, కి డ్నీ సమస్యలు, డయాలసిస్‌ అవసరం ఉన్నవారికి ఉచిత వైద్యం అందించారు. కరీంనగర్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ సురభి రాజేందర్‌రావు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్‌ బస్టాండ్‌ సమీపంలో శుక్రవారం కారు, బైక్‌ ఢీకొన్న సంఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై లక్ష్మణ్‌ తెలిపిన వివరాలు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంకు చెందిన చల్ల గిరిధర్‌ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నివాసముంటున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ దైవదర్శానానికి కారులో వెళ్లి తిరిగి వస్తున్నారు. మండలంలోని రాచర్లతిమ్మాపూర్‌ వద్ద కామారెడ్డి వైపు నుంచి బైక్‌పై వస్తున్న దుమాలకు చెందిన పాముల సతీశ్‌ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గిరిధర్‌, సంగీత, రాధ, సాత్విక, సాహిత్య, మనోజ్ఞ తీవ్రంగా గాయపడ్డారు. గిరిధర్‌ ఫిర్యాదుతో సతీశ్‌పై కేసు నమోదు చేసి, క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై లక్ష్మణ్‌ తెలిపారు.

దాడి కేసులో నలుగురికి నాలుగేళ్ల జైలు

వేములవాడ: దాడి ఘటనలో నలుగురికి నాలుగేళ్లు జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ వేములవాడ జడ్జి ప్రవీణ్‌ శుక్రవారం తీర్పునిచ్చినట్లు రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ తెలి పారు. వేములవాడఅర్బన్‌ మండలం అనుపురం గ్రామానికి చెందిన గంగు లక్ష్మిరాజం, అతని భార్య బాలవ్వను పాతకక్షలతో 2017లో అదే గ్రామానికి చెందిన ఎర్రం ప్రవీణ్‌, ఎర్రం అంజయ్య, ఎర్రం ముత్తయ్య, ఎర్రం ప్రసాద్‌, ఎర్రం శశి దాడిచేసి గాయపరిచారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి ఈమేరకు తీర్పు వెలువరించారు.

కోడెలు తరలిస్తున్న వ్యక్తిపై కేసు

జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా మూడు కోడెలు తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్‌ తెలిపారు. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన ఎండీ నజార్‌ ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం ఉదయం మూడు కోడెలను జగిత్యాలకు తీసుకొస్తుండగా గొల్లపల్లి రోడ్‌లో పట్టుకొని గోశాలకు తరలించి నాజర్‌పై కేసు నమోదు చేశామన్నారు.

రోడ్డుప్రమాదంలో మహిళా హోంగార్డుకు గాయాలు

వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలో మహిళా హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడింది. స్థానికులు తెలిపిన వివరాలు. వీర్నపల్లి ఠాణాలో హోంగార్డుగా జ్యోతి విధులు నిర్వహిస్తుంది. విధులు ముగించుకొని ఇంటికి లిఫ్ట్‌ అడిగి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ హోంగార్డు జ్యోతిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అనారోగ్యంతో రెండు కోడెలు మృతి

జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి

వేములవాడఅర్బన్‌: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలలో శుక్రవారం అనారోగ్యంతో రెండు కోడెలు మృతి చెందినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. గోశాలలో ఉన్న 1,300 కోడెలలో ప్రస్తుతం మొత్తం 11 కోడెలకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నాయన్నారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

యశోదలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం1
1/1

యశోదలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement