ట్రాక్టర్‌ బోల్తాపడి యువరైతు.. | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తాపడి యువరైతు..

Jun 6 2025 1:11 AM | Updated on Jun 6 2025 1:11 AM

ట్రాక

ట్రాక్టర్‌ బోల్తాపడి యువరైతు..

మల్లాపూర్‌: వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌ బోల్తా పడి యువ రైతు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవపేట శివారులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెదలి ప్రవీణ్‌(30)కు భార్య రమ్య, ఇద్దరు కొడుకులున్నారు. గ్రామశివారులోని తన వ్యవసాయ భూమిని చదును చేసేందుకు పెద్ద కుమారుడు శ్రీహాన్‌తో కలిసి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శ్రీహాన్‌ను స్థానికులు మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తాపడి యువరైతు..1
1/1

ట్రాక్టర్‌ బోల్తాపడి యువరైతు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement