
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి
మానకొండూర్: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజలను కోరారు. లలితాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పర్యావరణ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. గ్రామస్తులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని, ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. అధికారులు గ్రామాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట చేతికొచ్చిన తర్వాత వ్యర్థాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో కిరణ్, ఏపీవో శ్రీనివాస్, యునిసెఫ్ ప్రతినిధి కిషన్స్వామి పాల్గొన్నారు.
కరీంనగర్ను గ్రీన్ సిటీగా మార్చాలి
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలను పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. గురువారం పద్మానగర్లోని మానేరు పరివాహక సమీపంలో నగరపాలక సంస్థ, మెప్మా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, సహాయ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ సంజీవ్, డీఈలు శ్రీనివాస్రావు, లచ్చిరెడ్డి, పర్యావరణ ఇంజినీర్ స్వామి, డీఎంసీ శ్రీవాణి, టీఎంసీ మానస, సీవోలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.