
చిన్నారుల ఆత్మీయ నేస్తం బాలభవన్
చిన్నారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణనిస్తూ.. బాలభవన్ ఆత్మీయ నేస్తంగా మారిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆడిటోరియంలో విద్యాశాఖ, బాలభవన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. 45 రోజుల శిక్షణ శిబిరంలో సంగీతం, జానపద నత్యం, శాసీ్త్రయ నృత్యం, మృదంగం, కర్రసాము, అబాకస్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, యోగా అంశాల్లో నిపుణులు చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో మొండయ్య, జిల్లా విద్యా నియంత్రణ అధికారి అశోక్ రెడ్డి, బాలభవన్ సూపరింటెండెంట్ మంజులా దేవి, బాలభవన్ శిక్షకులు సంగెం రాధకృష్ట, శ్రీధర్, కృష్టకుమార్, సూర్యశ్రీ, అనూప్, రాధిక, మల్లిక, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్కల్చరల్
నృత్యం చేస్తున్న చిన్నారులు