
హత్యా.. ప్రమాదమా?
● అనుమానాస్పద స్థితిలో సింగరేణి కార్మికుడు మృతి
గోదావరిఖని: అనుమానాస్పద స్థితి లో సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. స్థానిక గంగానగర్లో ఉంటూ శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే–7లో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గాదెం సాగర్(30) మంగళవారం అర్ధరాత్రి స్థానిక బస్టాండ్ సమీప సమాదుల సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని కడుపు, తలపై గాయాలుండటంతో ఎవరైనా దాడి చేసి చంపారా? లేక కిందపడి గాయాలపాలై మృతి చెందాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నీతో మాట్లాడాల్సి ఉందని కొందరు ఫోన్చేసి అతిగా మద్యం తాగించి దాడిచేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవల ఓ పంచాయితీ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే తనపై దాడిచేసిన సమయ ంలో కాపాడాలంటూ అతని మిత్రులకు కూడా మెసేజ్ లు చేసినట్లుగా పంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చేఅవకాశం ఉంది. సాగర్ బీఆర్ఎస్లో చురుకై న కా ర్యకర్తగా పనిచేశారు. సాగర్ మృతిని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్సై భూమేశ్ తెలిపారు. కేసు విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.