చిట్‌ఫండ్‌ ఎదుట బాధితుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

చిట్‌ఫండ్‌ ఎదుట బాధితుల ఆందోళన

Jun 5 2025 8:18 AM | Updated on Jun 5 2025 8:18 AM

చిట్‌ఫండ్‌ ఎదుట బాధితుల ఆందోళన

చిట్‌ఫండ్‌ ఎదుట బాధితుల ఆందోళన

కరీంనగర్‌క్రైం: నగరంలోని ఒక ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ మేనేజర్‌ తాను వేసిన చిట్టీ ఎత్తుకొని ప్రభుత్వ ఉద్యోగులతో పూచీకత్తు పెట్టించుకొని కిస్తీలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తను పనిచేసే చిట్‌ఫండ్‌ ఎదుట బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన కె.రవికుమార్‌ ఒక చిట్‌ఫండ్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న గసికంటి మహేందర్‌, ఇరుగురాల నర్సయ్య అనే ప్రభుత్వ ఉద్యోగులతో పూచీకత్తు పెట్టించుకొని తాను వేసిన చిట్టీని తీసుకున్నాడు. చిట్టీ ఎత్తుకొని కట్టాల్సిన డబ్బులు కట్టకపోవడంతో పూచీకత్తు పెట్టిన వారికి కంపెనీ నుంచి నోటీసులు వచ్చాయి. దీనితో అతను ప్రస్తుతం పనిచేసే కోర్టు సమీపంలోని ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ కార్యాలయం వద్ద బాధితులు నిరసన తెలుపుతూ యాసిడ్‌ బాటిల్‌ పట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న త్రీటౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకొని బాధితులను, రవికుమార్‌ను అక్కడి నుంచి పంపించివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement