
జమ్మికుంటకు దోస్త్ హెల్ప్లైన్ సెంటర్
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ మంజూరు కావడంపై ప్రిన్సిపాల్ డా. రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ జాయింట్ డైరెక్టర్లు డా.రాజేంద్రసింగ్, డా.బాలభాస్కర్కు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. డిగ్రీ అడ్మిషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తితే దోస్త్ హెల్ప్ లైన్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. గతంలో దరఖాస్తుదారులకు సమస్యలు తలెత్తినప్పుడు కరీంనగర్, హనుమకొండ వెళ్లాల్సి ఉండేదని, ప్రస్తుతం దోస్త్ సెంటర్ మంజూరుతో ఈ ప్రాంత విద్యార్థులకు సౌకర్యాంగా ఉంటుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల దోస్త్ కో ఆర్డినేటర్ ఎల్.రవీందర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్ను 94911 14511, 99494 94549, 98496 89956 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.