
నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభం
కరీంనగర్ అర్బన్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించింది. సోమవారం రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్బాబు లాంఛనంగా ప్రారంభించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 207 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి గ్రామంలో ముగ్గురు రైతులకు వరి, పెసర విత్తనాలు అందించనున్నట్లు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డా.జి.ఉపారాణి తెలిపారు. నాణ్యమైన విత్తనోత్పత్తిని గ్రామంలోనే ప్రోత్సహించేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు.