
వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం
కరీంనగర్ కల్చరల్: కరీంనగర్లోని మహాశక్తి ఆల య పంచాదశ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ కుమార్ పాల్గొన్నారు. హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ భారతిస్వామి ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ గణపతి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు పంచామతాభిషేకం చేశారు. స్వస్తి పుణ్య హవచనం, గణపతి పూజ, అఖండ దీపారాధన, సర్వతో భద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమం, రుద్ర సహిత చండీహోమం, పూర్ణాహుతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. విద్యారణ్య భారతిస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మమే శాశ్వతమైన ధర్మమని ఉపదేశించారు. నేటితరం తల్లిదండ్రులను గౌరవించాలని, ఆలయాలను సందర్శించాలని, ధర్మాన్ని సంరక్షించాలన్నారు. మాజీ మేయర్ వై.సునీల్రావు, మాజీ కార్పొరేటర్ బండ సుమ, భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం